Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో 15 రోజులు ముందుగానే ఇంటర్ పరీక్షలు

Webdunia
ఆదివారం, 10 డిశెంబరు 2023 (12:31 IST)
తెలంగాణా రాష్ట్రంలో వచ్చే యేడాది నిర్ణీత షెడ్యూల్ కంటే 15 రోజులు ముందుగానే ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. సాధారణంగా ప్రతి యేటా ఇంటర్ పరీక్షలు మార్చి నెల మూడో వారం నుంచి నిర్వహిస్తుంటారు. అయితే, వచ్చే యేడాది మాత్రం అందుకు భిన్నంగా మార్చి మొదటి వారంలోనే నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. 
 
వచ్చే యేడాది లోక్‌సభ ఎన్నికలకు ఫిబ్రవరి లేదా మార్చి నెలలో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. దీంతో అధికారులు ఇతర పనుల్లో బిజీగా ఉండే అవకాశం ఉంది. ఈ కారణంగా పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీనికితోడు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఉన్నాయి. ఇంటర్ పరీక్షలను ముందుగానే నిర్వహించడం వల్ల విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌కు సన్నద్ధం కావడానికి సమయం ఉంటుంది. 
 
ఇంటర్ పరీక్షలు ముగిశాక అదే నెల 12న లేదంటే 14 నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. అలాగే, ఫిబ్రవరి 26 నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇవన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మార్చి 1 నుంచే ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు సమాయత్తం అవుతోంది. దామోదర రాజనరసింహ శనివారమే విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన అనుమతి తర్వాత పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments