Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ అక్రమాస్తుల కేసు : తెలంగాణ హైకోర్టు నోటీసు ... చిక్కులు తప్పవా?

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (18:30 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీచేసింది. జగన్ అక్రమాస్తుల కేసులపై జనసేన పార్టీ సీనియర్ హరిరామజోగయ్య దాఖలు చేసిన పిల్‌పై విచారణ జరిపిన కోర్టు.. జగన్‌తో పాటు సీబీఐ‍కు నోటీసులు జారీచేసింది. అయితే, ప్రతివాదులకు మాత్రం ఇప్పటికీ నోటీసులు అందలేదని తెలుస్తుంది. 
 
ప్రజా ప్రతినిధులపై ఉన్న వివిధ రకాల కేసులను త్వరగా విచారించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ప్రజాప్రతినిధుల కేసులను సుమోటోగా పిల్ రూపంలో విచారిస్తుంది. ఈ ప్రజాప్రతినిధుల కేసుల సుమోటో పిల్‌‍ను జగన్ కేసులపై దాఖలైన పిల్‌తో జతపరచాలని కోర్టు రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీచేసింది. 
 
జగన్‌పై నమోదైన కేసుల విచారణను ఎన్నికల్లోపు పూర్తి చేయాలని హరిరామజోగయ్య తన పిటిషన్‌లే కోరారు. ఇంకా 20 కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై సీబీఐ తరపు న్యాయవాది స్పందిస్తూ, డిశ్చార్జ్ పిటిషన్‌ పెండింగ్‌పై సీబీఐ కోర్టులో మెన్షన్ చేసినట్టు తెంలగాణ హైకోర్టుకు తెలిపారు. వాదనలు ఆలకించిన పిమ్మట ఈ డిశ్చార్జ్ పిటిషన్లపై రెండు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణనను మూడు నెలలకు వాయిదావేసింది. 

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments