Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

ఠాగూర్
మంగళవారం, 26 నవంబరు 2024 (18:56 IST)
పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉండరు. ఒకవేళ తగినంత మంది టీచర్లు ఉంటే విద్యార్థులు ఉండరు. అయితే, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా నారపనేని పల్లిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ పాఠశాలలో కేవలం ఒక్కరంటే ఒక్క విద్యార్థిని మాత్రమే ఉంది. ఆ విద్యార్థిని కోసం ప్రభుత్వం ప్రతి యేటా అక్షరాలా రూ.12.48 లక్షలను ఖర్చు చేస్తుంది. 
 
నారపనేని పల్లి ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని కీర్తన కోసం ప్రభుత్వం ఒక ఉపాధ్యాయుడిని నియమించింది. ఆ ఉపాధ్యాయుడుకి నెలకు రూ.1,01,167ను వేతనంగా చెల్లిస్తుంది. ఆ ప్రకారంగా టీచర్‌కు 12 నెలలకుగాను రూ.12.14 లక్షలు చెల్లిస్తుంది. మధ్యాహ్న భోజనం నిమిత్తం వంట మనిషికి నెలకు రూ.3000 ఇస్తుండగా, పారిశుద్ధ్య కార్మికురాలు, స్కూల్ మెయింటైన్ గ్రాండ్, స్పోర్ట్స్ గ్రాండ్.. అన్నీ కలిపి సుమారు రూ.12.84 లక్షల ఖర్చు చేస్తున్నారు. ఈ విషయం ఇపుడు మీడియాలో వైరల్ కావడంతో ఇకపై ఈ పాఠశాలను కొనసాగిస్తారో లేక సమీపంలోని పాఠశాలలో విలీనం చేస్తారో వేచి చూడాల్సిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments