Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా... పుదుచ్చేరి లోక్‌సభ నుంచి పోటీ!!

ఠాగూర్
సోమవారం, 18 మార్చి 2024 (12:04 IST)
తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం ఉదయం తమిళిసై రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ గవర్నర్ కార్యాలయం నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది. లోక్‌సభ ఎన్నికల్లో నేపథ్యంలో తమిళిసై రాజీనామా సంచలనంగా మారింది. ఆమె పుదుచ్చేరి లోక్‌సభ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 
 
నిజానికి ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ గత కొంతకాలంగా ప్రచారం సాగుతుంది. కానీ, అలాంటిదేమీ లేదంటూ ఆమె తోసిపుచ్చుతూ వచ్చారు. ఈ క్రమంలో తన గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతో ఆమె సార్వత్రిక ఎన్నికల్లో పోటీ ఖాయమని తేలిపోయింది. నాడార్ సామాజిక వర్గానికి చెందిన తమిళిసై... పుదుచ్చేరి లేదా తమిళనాడులోని సౌత్ చెన్నై, తిరునెల్వేలి, కన్యాకుమారి లోక్‌సభ స్థానాల నుంచి ఆమె బరిలోకి దిగొచ్చన్న ప్రచారం సాగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments