Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా... పుదుచ్చేరి లోక్‌సభ నుంచి పోటీ!!

ఠాగూర్
సోమవారం, 18 మార్చి 2024 (12:04 IST)
తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం ఉదయం తమిళిసై రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ గవర్నర్ కార్యాలయం నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది. లోక్‌సభ ఎన్నికల్లో నేపథ్యంలో తమిళిసై రాజీనామా సంచలనంగా మారింది. ఆమె పుదుచ్చేరి లోక్‌సభ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 
 
నిజానికి ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ గత కొంతకాలంగా ప్రచారం సాగుతుంది. కానీ, అలాంటిదేమీ లేదంటూ ఆమె తోసిపుచ్చుతూ వచ్చారు. ఈ క్రమంలో తన గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతో ఆమె సార్వత్రిక ఎన్నికల్లో పోటీ ఖాయమని తేలిపోయింది. నాడార్ సామాజిక వర్గానికి చెందిన తమిళిసై... పుదుచ్చేరి లేదా తమిళనాడులోని సౌత్ చెన్నై, తిరునెల్వేలి, కన్యాకుమారి లోక్‌సభ స్థానాల నుంచి ఆమె బరిలోకి దిగొచ్చన్న ప్రచారం సాగుతుంది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments