ఆ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు ఏమయ్యారు?

ఠాగూర్
సోమవారం, 19 మే 2025 (19:15 IST)
తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట పట్టణంలోని ఖాదర్‌పుర వీధిలో నివసించే ఓ కుటుంబంలోని ఐదుగురు సభ్యులు అదృశ్యమయ్యారు. శనివారం ఉదయం నుంచి వారు కనిపించడం లేదు. ఫోన్లను ఇంట్లోనే వదిలివేసి వెళ్లారు. స్థానికులు, బంధువులు ఏదైనా ఊరికి వెళ్లారని భావించారు. కానీ, రోజులు గడుస్తున్నా వారి జాడ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
ఇంటి నుంచి కనిపించకుండా పోయిన వీరబత్తిన బాలకిషన్‌కు అప్పులు ఉన్నాయని, తనకు డబ్బులు ఇచ్చేవారు ఇవ్వకపోవడంతో వడ్డీలు కట్టలేక ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నట్టు లేఖ రాసిపెట్టారని బంధువులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
బాలకిషన్ తండ్రి జనార్ధన్, భార్య వరలక్ష్మి, కుమారుడు శ్రవణ్, కుమార్తెలు కావ్య, శిరీష కనిపించడం లేదని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... అదృశ్యమైన వారి కోసం గాలిస్తున్నారు. అలాగే, వారి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీపీ మధు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments