Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాధవీలత గట్టిపోటీ ఇచ్చినా మజ్లిస్‌కే గెలుపు.. ఏపీలో ఆ ముగ్గురు?

సెల్వి
శనివారం, 1 జూన్ 2024 (22:23 IST)
తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు గాను మజ్లిస్ పార్టీ హైదరాబాద్‌లో మాత్రమే పోటీ చేసిందని గ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైందని ఆరా మస్తాన్ సర్వే గుర్తు చేసింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి మాధవీలత గట్టి పోటీ ఇచ్చారని... అయినప్పటికీ మజ్లిస్ ఈ స్థానాన్ని గెలుచుకోనుందని తెలిపింది. 
 
హైదరాబాద్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన కొంపెల్ల మాధవీలత ఓడిపోతున్నట్లుగా ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైందని ఆరా మస్తాన్ సర్వే తేల్చింది. 
 
అలాగే ఆరా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెలువరించారు. గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయిన జనసేనాని పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో నెగ్గి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని అంచనా వేశారు. 
 
టీడీపీ అధినేత చంద్రబాబు భారీ మెజారిటీతో నెగ్గడం ఖాయమని, అదే విధంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి నుంచి విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో ఎంట్రీ ఇవ్వనున్నారని 'ఆరా' మస్తాన్ వివరించారు. 
 
ఇక, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొడతాడని అంచనా వేశారు. బాలయ్యకు మంచి మెజారిటీ వస్తుందని అన్నారు. అయితే... ఓవరాల్ అంచనాల ప్రకారం ఏపీలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments