Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీస్ ఏసీపీ నివాసంలో ఏసీబీ సోదాలు.. ఆదాయానికిమించిన కేసులో ఏసీపీ అరెస్టు!

ఠాగూర్
బుధవారం, 22 మే 2024 (06:27 IST)
తెలంగాణా రాష్ట్రంలో సీసీఎస్ ఏసీపీ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు పోగు చేసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర రావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. మంగళవారం ఆయనకు సంబంధించిన నివాసాలు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఉమామహేశ్వర రావు అవినీతికి సంబంధించి కీలక పత్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. 
 
ఆ తర్వాత ఏసీపీ ఉమామహేశ్వర రావును ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనను అరెస్ట్ చేశామని ఏసీబీ జేడీ సధీంద్రబాబు వెల్లడించారు. బుధవారం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు తరలిస్తామని తెలిపారు. 
 
కాగా, ఈ తనిఖీల్లో 17 ప్రాంతాల్లో ఉమామహేశ్వర రావుకు ఆస్తులు ఉన్నట్టు గుర్తించినట్టు తెలిపారు. వీటిలో ఘట్‌కేసర్‌లో ఐదు ఫ్లాట్స్, శామీర్ పేటలో విల్లా గుర్తించామని చెప్పారు. ఏసీపీ ఉమామహేశ్వర రావుకు చెందిన రెండు లాకర్లు గుర్తించామని వెల్లడించారు. రూ.38 లక్షల నగదు, 60 తులాల బంగారం సీజ్ చేశామని చెప్పారు. ఇప్పటివరకు మార్కెటి విలువ ప్రకారం రూ.3 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments