Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్సీ ఎన్నికలు : కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న

వరుణ్
గురువారం, 25 ఏప్రియల్ 2024 (09:50 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు  జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ అధిష్టానం సీటును కేటాయించింది. గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. ఆయన నల్గొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చారు. ఈ క్రమలో పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఆయన స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ స్థానంలో తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ను ఎంపిక చేసినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
గత యేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ స్థానం నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఓటర్ల జాబితా కూడా వెలువరించారు. ఈ ఎన్నికలకు మొత్తం 4.61 లక్షల మంది పట్టభద్రులు ఓటర్లుగా తమ పేరు నమోదు చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments