Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పని చేస్తే సీఎస్‌తో అధికారులందరినీ జైలుకు పంపిస్తాం : సుప్రీంకోర్టు

ఠాగూర్
బుధవారం, 16 ఏప్రియల్ 2025 (14:55 IST)
హైదరాబాద్ నగరంలోని కంచి గచ్చిబౌలిలో అభయారణ్యంలోని చెట్లను ముందస్తు అనుమతులు లేకుండా నరికినట్టు తేలితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా అధికారులందరినీ జైలుకు పంపిస్తామని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు గచ్చిబౌలి భూముల వివాదంపై బుధవారం జరిగిన విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయి సారథ్యంలోని ధర్మాసనం పై విధంగా స్పందించింది. 
 
కంచి గచ్చిబౌలి అభయారణ్యంలోని చెట్లను కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా లేదా అన్నది స్పష్టం చేయాలని ధర్మాసనం వ్యాఖ్యానించారు. రూ.10 వేల కోట్లకు మార్టిగేజ్ చేశారని సీఈసీ నివేదికలో పొందుపరిచిన వివరాలను అమికస్ క్యూరీ కోర్టు దృష్టికి తీసుకురాగా, చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా లేదా అనేది తమకు ముఖ్యమని, ఆ భూముల మార్టిగేజ్ విషయం తమకు అనవసరమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు ఆలకించిన ధర్మాసనం.. తదుపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments