Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి టెర్రస్‌పై దూసుకెళ్లిన బుల్లెట్.. మహిళకు గాయం

సెల్వి
బుధవారం, 31 జులై 2024 (10:04 IST)
హైదరాబాద్‌లోని నార్సింగి ప్రాంతంలో మంగళవారం తన ఇంటి టెర్రస్‌పై బుల్లెట్ దూసుకెళ్లడంతో ఒక మహిళ గాయపడినట్లు అధికారులు తెలిపారు. సైనికులు ప్రాక్టీస్ చేస్తున్న సమీపంలోని ఆర్మీ ఫైరింగ్ రేంజ్ నుంచి అది మిస్ ఫైర్ అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
 
ఈ ఘటన సైబరాబాద్ కమిషనరేట్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పద్మ అనే మహిళ గంధంగూడలోని తన భవనం టెర్రస్‌పై ఉండగా, ఆమె కాలికి బుల్లెట్ తగిలి చీలమండ దగ్గర బుల్లెట్ గాయమైంది.
 
వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి డిశ్చార్జి చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నార్సింగిలో ఈ నెలలో ఇది రెండో ఘటన. జూన్ 13న, అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని ఐదవ అంతస్తులో ఉన్న ఫ్లాట్‌లోని అద్దాల కిటికీల నుంచి బుల్లెట్ దూసుకుపోయింది. 
 
ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. గంధంగూడ సమీపంలో రెండు ఫైరింగ్ రేంజ్‌లు ఉన్నాయి, ఇక్కడ పోలీసులు, ఆర్మీ సిబ్బంది ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments