Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్, బుల్లెట్ మోటార్‌కి మంటలు, ఆర్పుతుండగా పేలుడు, ఆరుగురికి తీవ్ర గాయాలు - live video

ఐవీఆర్
ఆదివారం, 12 మే 2024 (21:54 IST)
హైదరాబాదులో ఆదివారం సాయంత్రం మొఘల్‌పురా వద్ద ఘోర ఘటన చోటుచేసుకున్నది. మంటలను ఆర్పే ప్రయత్నంలో ఉండగా బుల్లెట్ మోటార్‌సైకిల్‌లోని ఇంధన ట్యాంక్ పేలడంతో ఒక పోలీసు సహా ఆరుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ జంట మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా మైమర్ చికెన్ సెంటర్ బీబీ బజార్ రోడ్డు సమీపంలో వాహనం నుంచి మంటలు చెలరేగాయి.
 
దంపతులు ద్విచక్రవాహనం నుంచి కిందకు దిగారు. స్థానికులు గుమిగూడి సమీపంలోని దుకాణం నుంచి తెచ్చిన నీటిని ఉపయోగించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. నీళ్లు, గోనె సంచులను ఉపయోగించి మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తుండగా, ట్యాంక్ అకస్మాత్తుగా పేలడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. మోటార్ సైకిల్ పేలుడు ఘటనలో పార్క్ చేసిన మరో రెండు మోటార్‌సైకిళ్లకు కూడా మంటలు అంటుకున్నాయి. ఈ మంటల కారణంగా దుకాణం కూడా ధ్వంసమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments