Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీతేజ్‌ మెదడుకు డ్యామేజీ జరిగిందంటున్న వైద్యులు.. (Video)

ఠాగూర్
మంగళవారం, 17 డిశెంబరు 2024 (18:37 IST)
హైదరాబాద్ నగరంలోని సంధ్య థియేటర్‌లో 'పుష్ప-2' మూవీ ప్రీమియర్ షో ప్రదర్శన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ బాలుడు ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే వుందనే, వెంటిలేటర్‌పై చికిత్స జరుగుతున్నట్టు సమాచారం. 
 
గత రెండు వారాలుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా శ్రీతేజ్ ఆరోగ్యం పరిస్థితిపై వైద్యులు మెడికల్ బులిటెన్‌ను విడుదల చేశారు. అలాగే, ప్రభుత్వం తరపున నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినాలు శ్రీతేజ్ చికిత్స పొందుతున్న కిమ్స్ ఆస్పత్రికి వచ్చి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 
 
ఆ తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ, తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ మెదడుకు డ్యామేజ్ జరిగిందని వైద్యులు విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొన్నట్టు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఆ బాలుడు కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని తెలిపారు. మెదడు దెబ్బతిన్న కారణంగా చికిత్స చాలాకాలం కొనసాగాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారని వివరించారు. చిత్ర హీరో అల్లు అర్జున్ రావడంతో ఈ తొక్కిసలాట జరిగిన విషయం తెల్సిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments