Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీతేజ్‌ మెదడుకు డ్యామేజీ జరిగిందంటున్న వైద్యులు.. (Video)

ఠాగూర్
మంగళవారం, 17 డిశెంబరు 2024 (18:37 IST)
హైదరాబాద్ నగరంలోని సంధ్య థియేటర్‌లో 'పుష్ప-2' మూవీ ప్రీమియర్ షో ప్రదర్శన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ బాలుడు ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే వుందనే, వెంటిలేటర్‌పై చికిత్స జరుగుతున్నట్టు సమాచారం. 
 
గత రెండు వారాలుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా శ్రీతేజ్ ఆరోగ్యం పరిస్థితిపై వైద్యులు మెడికల్ బులిటెన్‌ను విడుదల చేశారు. అలాగే, ప్రభుత్వం తరపున నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినాలు శ్రీతేజ్ చికిత్స పొందుతున్న కిమ్స్ ఆస్పత్రికి వచ్చి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 
 
ఆ తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ, తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ మెదడుకు డ్యామేజ్ జరిగిందని వైద్యులు విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొన్నట్టు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఆ బాలుడు కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని తెలిపారు. మెదడు దెబ్బతిన్న కారణంగా చికిత్స చాలాకాలం కొనసాగాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారని వివరించారు. చిత్ర హీరో అల్లు అర్జున్ రావడంతో ఈ తొక్కిసలాట జరిగిన విషయం తెల్సిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన శంకరప్రసాద్‌గారిని కలిసేందుకు సైకిల్‌పై వచ్చిన మహిళా వీరాభిమాని (వీడియో)

Vishal engagment: నేడు నిశ్చితార్థం జరుపుకున్నవిశాల్, సాయి ధన్సిక

Chiru: అభిమాని రాజేశ్వరి పట్ల మెగాస్టార్ చిరంజీవి ఆత్మీయ స్పందన

Shilpa: సుధీర్ బాబు జటాధర నుంచి తాంత్రిక పూజ చేస్తున్న శిల్పా శిరోద్కర్‌ లుక్

Barbaric Review: మారుతి సమర్పించిన త్రిబాణధారి బార్బరిక్ మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments