Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ప్రధాని మోడీ పర్యటన.. సాయంత్రం 4.30 గంటలకు...

వరుణ్
మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (11:30 IST)
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికి వస్తున్నారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రధాని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన వివరాలను పరిశీలిస్తే, 
 
ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం సాయంత్రం 4:20 గంటలకు హెలికాప్టర్లో జహీరాబాద్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి జహీరాబాద్ - మెదక్ జనసభ ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం 4:30 గంటల నుంచి 5:20 వరకు ప్రజాసభలో ప్రసంగిస్తారు. ఈ సభ ముగిసిన తర్వాత 5:30 గంటలకు జహీరాబాద్ నుంచి దుండిగల్ ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు.
 
కాగా, మే 3, 4వ తేదీల్లో ప్రధాని తెలంగాణలో పర్యటిస్తారని మొదట బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. కానీ, ఈ తారీఖుల్లో మోడీ పర్యటన వాయిదా పడింది. మే 8, 9 తేదీల్లో ప్రధాని రాష్ట్రంలో పర్యటించనున్నారని తెలుస్తోంది. మే 8న వేములవాడలో జరిగే భారీ బహిరంగ సభకు హాజరవుతారని సమాచారం.
 
ఇదిలావుంటే మే ఒకటో తేదీన హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. చార్మినార్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని గౌలిపురలో సాయంత్రం 5 గంటలకు నిర్వహించే రోడ్ షోలో ఆయన పాల్గొననున్నారు.
 
ముందుగా లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం నుంచి శాలిబండ సుధా థియేటర్ వరకు అమిత్ షా రోడ్ షో కొనసాగనుంది. వచ్చే నెల 5న సైతం నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి అభ్యర్థులకు మద్దతుగా అమిత్ షా ఆయా నియోజకవర్గాలలో పర్యటిస్తారని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు - జనసైన్యాన్ని ఓ రాజువై నడిపించు : చిరంజీవి

#chiranjeevi birthday : 'విశ్వంభరు'నికి జనసేనాని పుట్టిన రోజు శుభాకాంక్షలు

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments