Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసుల వాహనాల్లోనే భారాసా ఎన్నికల నిధుల తరలింపు : త్వరలో నోటీసులు!!

ఠాగూర్
సోమవారం, 1 ఏప్రియల్ 2024 (09:28 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అంశం ఇపుడు సంచలనంగా మారింది. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో కొందరు పోలీసు ఉన్నతాధికారులు ఈ అడ్డగోలు పనికి పాల్పడ్డారు. ఈ విషయం ఇపుడు వెలుగులోకి వచ్చింది. పైగా, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇప్పటికే పలువురు పోలీస్ ఉన్నతాధికారులను అరెస్టు చేశారు కూడా. అదేసమయంలో భారాసా అసెంబ్లీ ఎన్నికల కోసం నిధులను ఏకంగా పోలీసు వాహనాల్లోనే తరలించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ అంశంలో కొందరు రాజకీయ ప్రముఖులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ దిశగా న్యాయపరమైన అంశాలపై పోలీసులు చర్చిస్తున్నారు. 
 
తెలంగాణాలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఎన్నికల్లో నిధుల పంపిణీ కోసం పోలీసు వాహనాల్లో డబ్బు తరలించినట్టు ఫోన్ ట్యాపింగ్ నిందితులు అంగీకరించినట్టు సమాచారం. ఈ క్రమంలో పోలీసులు కొందరు రాజకీయ ప్రముఖులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పోటీ పడ్డ అభ్యర్థులు, గెలిచిన ఎమ్మెల్యేలకు నోటీసులు అందుతాయట.
 
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హవాలా కోణం కూడా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రణీత్ రావు ముఠా.. పలువురు ప్రజాప్రతినిధులు, హవాలా వ్యాపారుల ఫోన్లపై నిఘా పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. విచారణ సందర్భంగా నిందితులు ఈ విషయాలను అంగీకరించినట్టు సమాచారం. ఇక ప్రణీత్ రావు అందించిన సమాచారం ఆధారంగా అప్పట్లో కొందరు పోలీసులు క్షేత్రస్థాయిలో పంపిణీ అవుతున్న డబ్బు పట్టుకున్నారని పోలీసులు తాజాగా గుర్తించారు. 
 
మరోవైపు, ఒక ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థులకు డబ్బు పంపిణీలో మరో అధికారి కీలక పాత్ర పోషించినట్టుగా తేలింది. పోలీసు వాహనాల్లోనే పకడ్బందీగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మొత్తంలో నిధుల పంపిణీ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ విషయాలు నిర్ధారించుకునేందుకు.. డబ్బులు అందుకున్నారని భావిస్తున్న వారందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించవచ్చని సమాచారం. 
 
ఇందుకు సంబంధించి న్యాయపరమైన అంశాలపై అధికారులు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. నిందితుల వాంగ్మూలం ఆధారంగా అనుమానితులు అందరినీ పిలిపించి విచారించేందుకు ఉన్న మార్గాలపై కూడా కసరత్తు చేస్తున్నారని సమాచారం. మరోవైపు, ఫోన్ ట్యాప్ చేసి తనను బెదిరించారని ఓ వ్యాపారి ఆదివారం బంజారాహిల్స్ రాణాకు వచ్చి దర్యాప్తు బృందాన్ని కలిశారు. ప్రస్తుత కేసులోని నిందితుడు ఒకరు తన ఫోన్ వాయిస్ చూపించి మరీ తనను బెదిరించారని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments