Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేడారం జాతర : నిలువెత్తు బంగారం మొక్కుబడి.. ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవచ్చు..

సెల్వి
గురువారం, 8 ఫిబ్రవరి 2024 (20:44 IST)
మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం అయ్యింది. ఈ నేపథ్యంలో భక్తుల కానుకలను ఆన్ లైన్ ద్వారా చెల్లించే వెసులుబాటును ఆలయ అధికారులు కల్పించారు. ఈ సౌకర్యాన్ని మంత్రి కొండా సురేఖ బుధవారం ప్రారంభించారు.
 
మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ప్రభుత్వం అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించే వెసులుబాటు కల్పించింది. నిలువెత్తు బంగారం మొక్కుబడి కోసం రూ.60 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అలాగే మేడారం ప్రసాదాన్ని పోస్టు ద్వారా పొందే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు సమాచారం. 
 
కాగా, మేడారం జాతర బుధవారం ప్రారంభమైంది. జాతర మొదటి దశ గుడిమెలిగె పండుగతో ప్రారంభమైంది. మహా జాతరకు రెండు వారాల ముందు గుడిమెలగె తంతు నిర్వహిస్తారు. గుడిమెలిగెలో భాగంగా మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
 
రెండేళ్లకోసారి జరిగే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం ఉత్సవాలు ఈ నెల 21న ప్రారంభమై నాలుగు రోజుల పాటు కొనసాగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments