Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేడారం జాతర : నిలువెత్తు బంగారం మొక్కుబడి.. ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవచ్చు..

సెల్వి
గురువారం, 8 ఫిబ్రవరి 2024 (20:44 IST)
మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం అయ్యింది. ఈ నేపథ్యంలో భక్తుల కానుకలను ఆన్ లైన్ ద్వారా చెల్లించే వెసులుబాటును ఆలయ అధికారులు కల్పించారు. ఈ సౌకర్యాన్ని మంత్రి కొండా సురేఖ బుధవారం ప్రారంభించారు.
 
మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ప్రభుత్వం అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించే వెసులుబాటు కల్పించింది. నిలువెత్తు బంగారం మొక్కుబడి కోసం రూ.60 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అలాగే మేడారం ప్రసాదాన్ని పోస్టు ద్వారా పొందే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు సమాచారం. 
 
కాగా, మేడారం జాతర బుధవారం ప్రారంభమైంది. జాతర మొదటి దశ గుడిమెలిగె పండుగతో ప్రారంభమైంది. మహా జాతరకు రెండు వారాల ముందు గుడిమెలగె తంతు నిర్వహిస్తారు. గుడిమెలిగెలో భాగంగా మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
 
రెండేళ్లకోసారి జరిగే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం ఉత్సవాలు ఈ నెల 21న ప్రారంభమై నాలుగు రోజుల పాటు కొనసాగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments