Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాళ్లపారాణి ఆరకముందే.. తనువు చాలించిన నవ వధువు!!

ఠాగూర్
సోమవారం, 9 డిశెంబరు 2024 (15:35 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నెన్నెల మండలంలో ఓ విషాదకర ఘటన జరిగింది. కాళ్ళపారాణి ఆరకముందే నవ వధువు తనువు చాలించింది. విద్యుదాఘాతం రూరంలో ఆమెను మృత్యువు కబళించగా, ఆమె కుటుంబ సభ్యులు, భర్త కన్నీరుమున్నీరవుతున్నారు. 
 
ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. నెన్నెలకు చెందిన జంబి స్వప్న (22) అదే గ్రామానికి చెందిన పల్లె సిద్ధు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఈ నెల 4న వివాహం చేసుకున్నారు. అత్తగారింటికి వెళ్లిన స్వప్న ఆదివారం ఉదయం స్నానం చేయడానికి వాటర్ హీటర్ వాడారు. ఆ సమయంలో భర్త సిద్ధు బయటకు వెళ్లారు. 
 
ఈ క్రమంలో విద్యుత్తు పలుమార్లు ట్రిప్ అయ్యింది. విద్యుత్తు సరఫరా లేదనుకున్న స్వప్న నీటిలో చెయ్యి పెట్టి హీటర్ తీశారు. దీంతో విద్యుదాఘాతానికి గురవ్వడంతో కుటుంబసభ్యులు నెన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. 
 
సిద్ధుకు తండ్రి లేరు. తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో యువతి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందనుకుంటే విద్యుత్తు ప్రమాదం విషాదాన్ని మిగిల్చిందని అతను రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments