Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

ఠాగూర్
శుక్రవారం, 28 మార్చి 2025 (09:24 IST)
తెలంగాణ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి తన ముగ్గురు పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపిపెట్టింది. ఆ తర్వాత తాను కూడా ఆరగించింది. ఈ ఘటలో ముగ్గురు పిల్లుల ప్రాణాలు కోల్పోగా, ఆ తల్లి మాత్రం ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో చోటుచేసుకుంది. 
 
స్థానిక రాఘవేంద్ర నగర్‌ కాలనీకి చెందిన ఓ మహిళ తన ముగ్గురు పిల్లలకు గురువారం రాత్రి పెరుగన్నంలో విషం కలిపి పెట్టింది. ఆ తర్వాత తాను కూడా ఆరగించింది. దీంతో ముగ్గురు పిల్లలు ఇంట్లోనే చనిపోగా, ఆ మహిళ మాత్రం అపస్మారకస్థితిలోకి జారుకోవడంతో ఆస్పత్రికి తరలించారు. 
 
ఆ మహిళను రజితగా గుర్తించారు. చనిపోయిన చిన్నారులను సాయికృష్ణ (12), మధుప్రియ (10), గౌతమ్ (8)గా గుర్తించారు. తాను, పిల్లలకు విషం కలిపిన పెరుగన్నం ఆరగించి, తన భర్త చెన్నయ్యకు మాత్రం పప్పు అన్నంపెట్టింది. దీంతో పెరుగన్నం తిన్న ముగ్గురు పిల్లలు ఇంట్లోనే చనిపోయారు. 
 
సమాచారం తెలుసుకున్న ముగ్గురు పిల్లుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజిత పరిస్థితి విషమంగా ఉంది. కాగా, కుటుంబ కలహాల కారణంగానే రజిత ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments