Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం రేవంత్ రెడ్డి సర్కారుకు మావోయిస్టుల వార్నింగ్.. ఎందుకు?

ఠాగూర్
శుక్రవారం, 15 నవంబరు 2024 (11:25 IST)
ఒకపుడు మావోయిస్టులకు కీలక స్థావంగా తెలంగాణ రాష్ట్రం ఉండేది. ఇపుడు వారి ఉనికి ఏమాత్రం కనిపించడం లేదు. అయితే, ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్ల మళ్లీ మావోయిస్టులు తెరపైకి వచ్చారు. రేవంత్ సర్కారును హెచ్చరిస్తూ ఓ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో బుల్డోజర్ పాలన కొనసాగిస్తున్నారని మావోలు మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి యేడాది గడుస్తోందని, కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం మాత్రం దూకుడుగా పనిచేస్తోందని మావోయిస్టు పార్టీ ఘాటుగా విమర్శించింది.
 
మావోయిస్టు పార్టీ తన లేఖలో హైడ్రా, మూసీ సుందరీకరణ అంశాలను, ఇటీవల కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో జరిగిన కూడా ప్రస్తావించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది. లగచర్లలో ఫార్మాసిటీని నిర్మించి, ప్రకృతి వనరులతో పాటు రైతుల పంట భూములను కొల్లగొట్టడానికి పథకం పన్నారని ఆరోపించారు. భూములు కోల్పోతున్న రైతులు జీవన్మరణ పోరాటంలో భాగంగా మిలిటెంట్ ఉద్యమం చేపట్టారని వెల్లడించారు.
 
ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న విధ్వంసం, అప్రజాస్వామిక పాలన కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల, బాధ్యతారాహిత్య వల్లనో జరుగుతున్నది కాదని... ఉద్దేశపూర్వకంగా, కార్పొరేట్ల లాభాల కోసం జరుగుతున్న ప్రయత్నమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్పొరేట్ల నమ్మినబంటునని నిరూపించుకోవడానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడని విమర్శించారు. కార్పొరేట్ల పెట్టుబడులలో వాటా, భారీ మొత్తంలో కమీషన్లు పొందుతున్నాడని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments