Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్కడ చూసినా డబ్బే.. రూ.35.50 లక్షలతో కూడిన బ్యాగ్ స్వాధీనం

సెల్వి
సోమవారం, 1 ఏప్రియల్ 2024 (15:12 IST)
తెలంగాణలో భారీ లక్షల నగదు ఎన్నికల వేళ పట్టుబడుతోంది. తాజాగా ఆర్పీఎఫ్ సిబ్బంది సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని రూ.37,50,000 నగదు ఉన్న బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. మహేష్ ఎం భగవత్, ఐపీఎస్, రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ ఏడీజీపీ, సాయేశ్వర్ గౌడ్, ఐఆర్పీ/ఎస్సీ తన సిబ్బందితో పాటు ఆర్పీఎఫ్ సిబ్బంది సమన్వయంతో సాధారణ ఎంపీ ఎన్నికల దృష్ట్యా తనిఖీలు నిర్వహించారు. 
 
తనిఖీల సమయంలో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నెం.01లోని మిడిల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద గేట్ నంబర్ 03 దగ్గర బ్యాగ్‌తో తమిళనాడులోని మధురాంతకం, కాంచీపురంకు చెందిన పి లక్ష్మణ్ రామ్ (45) అనే వ్యక్తిని వారు పట్టుకున్నారు. 
 
నికర నగదు రూ.37,50,000/- ఉన్న అతని బ్యాగ్‌ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత విచారణలో అతను సరైన పత్రాలను కలిగి వుండలేదు. ఇంకా ఆ నగదు గురించి సరైన సమాధానం కూడా ఇవ్వలేదు. దీంతో నగదును స్వాధీనం చేసుకున్నారు. 
 
ఆ నగదును తదుపరి చర్యలు తీసుకోవడానికి సరైన రసీదు కింద ఆదాయపు పన్ను శాఖ, ఆయకార్ భవన్, హైదరాబాద్‌కు అందజేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments