Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమోన్మాది దాడి.. కత్తితో దాడి.. యువతి మృతి.. ఆపై విద్యుత్‌ స్తంభం ఎక్కాడు?

సెల్వి
గురువారం, 29 ఆగస్టు 2024 (20:35 IST)
ప్రేమోన్మాది దాడిలో హైదరాబాద్‌ యువతి మృతి చెందింది. ఈ దారుణ ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గోపన్‌పల్లి తండాలో చోటుచేసుకుంది. ప్రేమోన్మాది దాడిలో యువతి దీపన తమాంగ్‌ (25) మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. 
 
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బీదర్‌కు చెందిన రాకేశ్‌.. మాదాపూర్‌లోని ఓ ప్రయివేట్‌ హాస్టల్‌లో ఉంటున్నాడు. పశ్చిమ్‌బెంగాల్‌కు చెందిన దీపన తమాంగ్‌ నల్లగండ్లలో బ్యుటీషియన్‌గా పనిచేస్తోంది. ఆమె గోపన్‌పల్లి తండా సమీపంలో స్నేహితులతో నివాసముంటోంది. 
 
కొంతకాలంగా రాకేశ్‌తో ఆమెకు పరిచయం ఉంది. పెళ్లిచేసుకోవాలని ఏడాది నుంచి అతడు వెంటపడుతున్నాడు. దానికి దీపన నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన రాకేశ్ కూరగాయల కత్తితో ఆమెపై దాడి చేశాడు. దీంతో యువతి మృతిచెందింది. 
 
అడ్డుకునేందుకు యత్నించినా స్నేహితులపైనా దాడికి అతడు పాల్పడ్డాడు. ఆపై ఆత్మహత్యకు యత్నించాడు. విద్యుత్‌ స్తంభం ఎక్కేందుకు యత్నించడంతో షాక్‌తో గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు రాకేశ్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments