Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలోని ఆ రెండు గ్రామాల్లో 100 శాతం పోలింగ్..!!

ఠాగూర్
మంగళవారం, 14 మే 2024 (10:24 IST)
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13వ తేదీన నాలుగో దశ పోలింగ్ జరిగింది. ఈ దశలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్‌సభ స్థానాలకు కూడా పోలింగ్ జరిగింది. అయితే, తెలంగాణాలోని రెండు గ్రామాల్లో ఏకంగా వంద శాతం పోలింగ్ నమోదైంది. అక్కడి ఓటర్లు ఓటుతో తమ చైతన్యాన్ని చాటారు. జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం చిన్నకొల్వాయిలో వంద శాతం పోలింగ్ నమోదైంది. గ్రామంలో 110 మంది ఓటర్లు ఉండగా అందరూ వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. ఇలా వంద శాతం ఓటింగ్‌కు కృషి చేసిన సెక్టోరల్ ఆఫీసర్ శక్రు నాయక్, కార్యదర్శి ముద్దం విజయ, బీఎల్వో యశోద, రూట్ అధికారి రాజ్‌కుమార్‌ను కలెక్టర్ యాస్మిన్ బాషా ప్రత్యేకంగా అభినందించారు. 
 
అలాగే, మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట తండాలో కూడా ఏకంగా 100 శాతం పోలింగ్ నమోదైంది. ఈ తండాలో ఏర్పాటు చేసిన 62ఏ అదనపు పోలింగ్ కేంద్రం పరిధిలో 210 మంది ఓటర్లు ఉండగా అందరూ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 95 మంది పురుషులు, 115 మంది మహిళలు ఉన్నారు. దంతో సంగాయిపేట తండా వాసులను మెదక్ జిల్లా కలెక్టర్ అభినందించారు. ఇదిలావుంటే, తెలంగాణాలో సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ వెల్లడించింది. గ్రామీణ తెలంగాణాలో పోలింగ్ శాతం దాదాపు 70 శాతానికి పైగా నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments