Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలోని ఆ రెండు గ్రామాల్లో 100 శాతం పోలింగ్..!!

ఠాగూర్
మంగళవారం, 14 మే 2024 (10:24 IST)
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13వ తేదీన నాలుగో దశ పోలింగ్ జరిగింది. ఈ దశలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్‌సభ స్థానాలకు కూడా పోలింగ్ జరిగింది. అయితే, తెలంగాణాలోని రెండు గ్రామాల్లో ఏకంగా వంద శాతం పోలింగ్ నమోదైంది. అక్కడి ఓటర్లు ఓటుతో తమ చైతన్యాన్ని చాటారు. జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం చిన్నకొల్వాయిలో వంద శాతం పోలింగ్ నమోదైంది. గ్రామంలో 110 మంది ఓటర్లు ఉండగా అందరూ వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. ఇలా వంద శాతం ఓటింగ్‌కు కృషి చేసిన సెక్టోరల్ ఆఫీసర్ శక్రు నాయక్, కార్యదర్శి ముద్దం విజయ, బీఎల్వో యశోద, రూట్ అధికారి రాజ్‌కుమార్‌ను కలెక్టర్ యాస్మిన్ బాషా ప్రత్యేకంగా అభినందించారు. 
 
అలాగే, మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట తండాలో కూడా ఏకంగా 100 శాతం పోలింగ్ నమోదైంది. ఈ తండాలో ఏర్పాటు చేసిన 62ఏ అదనపు పోలింగ్ కేంద్రం పరిధిలో 210 మంది ఓటర్లు ఉండగా అందరూ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 95 మంది పురుషులు, 115 మంది మహిళలు ఉన్నారు. దంతో సంగాయిపేట తండా వాసులను మెదక్ జిల్లా కలెక్టర్ అభినందించారు. ఇదిలావుంటే, తెలంగాణాలో సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ వెల్లడించింది. గ్రామీణ తెలంగాణాలో పోలింగ్ శాతం దాదాపు 70 శాతానికి పైగా నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments