కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

ఐవీఆర్
బుధవారం, 3 డిశెంబరు 2025 (17:09 IST)
ఈమధ్య కాలంలో గుండెపోటు సమస్యలతో మరణిస్తున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా మరో విషాదకర సంఘటన ఎల్బీ నగర్ పోలీసు స్టేషనులో జరిగింది. స్టేషనులో ఎస్సైగా పనిచేస్తున్న 58 ఏళ్ల సంజయ్ సావంత్ రోజు మాదిరిగానే నిన్న స్టేషనుకు వచ్చాడు. రాత్రయ్యాక తనకు కాస్త అలసటగా వుందనీ, బెడ్ పైన కాస్త విశ్రమించి వెళ్తానంటూ తోటి ఉద్యోగులతో చెప్పాడు.
 
దాంతో ఆయనను ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. ఐతే ఈరోజు ఉదయం సంజయ్ లేవకుండా అలాగే బెడ్ మీద పడుకుని వుండటాన్ని గమనించిన సిబ్బంది ఆయనను నిద్ర లేపే ప్రయత్నం చేసారు. ఐతే ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీనితో వెంటనే ఆయనను సమీప ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని మదం తో ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments