Webdunia - Bharat's app for daily news and videos

Install App

KCR in Assembly: కేసీఆర్ అసెంబ్లీకీ రావాలి.. రేవంత్ రెడ్డి

సెల్వి
ఆదివారం, 8 డిశెంబరు 2024 (10:20 IST)
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 39 మంది ఎమ్మెల్యేగా గెలిచారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి 64 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. బీజేపికి 8, ఎంఐఎం పార్టీకి 7, సీసీఐ ఒక్క స్థానాల్లో విజయం సాధించింది.
 
గత యేడాది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర లేపారు. ఇప్పటికే 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ విధానాలపై గొంతెత్తుతుంది. ఇప్పటికే హైడ్రా, మూసీ ప్రక్షాళన సహా పలు అంశాలపై ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తోంది.
 
ఈ నేపథ్యంలో తాజాగా జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలపై అందరి దృష్టి కేసీఆర్‌పైనే ఉంది. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకీ వస్తారా లేదా అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. 
 
గత అసెంబ్లీ సమావేశాలకు కూడా గులాబీ బాస్ హాజరు కాలేదు. దీంతో తాజాగా కేసీఆర్ అసెంబ్లీకీ రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకీ వస్తే అధికార ప్రతిపక్షాల మధ్య వార్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments