Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫాంహౌస్‌లో తండ్రిని కలిసిన కవిత... తండ్రి పాదాలకు నమస్కరించి...

ఠాగూర్
గురువారం, 29 ఆగస్టు 2024 (14:25 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరుచేసింది. దీంతో ఆమె తీహార్ జైలు నుంచి ఐదున్నర నెలల తర్వాత విడుదలయ్యారు. మంగళవారం విడుదలైన ఆమె బుధవారం హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. గురువారం ఎర్రవల్లిలోని తమ ఫామ్‌హౌస్‌లో ఉన్న తండ్రిని కలిసేందుకు వెళ్లారు. ఫామ్‌ హౌస్‌లో తన తండ్రి పాదాలకు నమస్కరించి ఆయన చేతికి ముద్దు పెట్టారు. 
 
కొన్ని నెలల తర్వాత తన కుమార్తె జైలులో ఉండటంతో తల్లడిల్లిపోయిన కేసీఆర్.. ఆమెను చూడగానే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆప్యాంగా దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకున్నారు. కుమార్తెను చాలా రోజుల తర్వాత చూసిన ఆనందం ఆయన ముఖంలో కనిపించింది. ఆ సమయంలో కవిత భర్త అనిల్, కవిత కుమారుడు కూడా ఉన్నారు. కవిత రాకతో ఎర్రవ ర్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ కోలాహలంగా, సందడిగా కనిపించింది. కాగా, పది రోజుల పాటు ఈ ఫాంహౌస్‌లోనే కవిత విశ్రాంతి తీసుకోనున్నారు. అందువల్ల తనను కలిసేందుకు పార్టీ నేతలు ఎవ్వరూ రావొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments