Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు - ఏడుగురు విద్యార్థుల ఆత్మహత్య!!

వరుణ్
గురువారం, 25 ఏప్రియల్ 2024 (12:23 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల్లో ఏడుగురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న మనస్తాపంతో ఆరుగురు విద్యార్థులు, ఫెయిల్ అవుతామన్న భయంతో మరొకరు చనిపోయారు. మంచిర్యాల, ఖమ్మం, హైదరాబాద్, మహబూబాబాద్, సిద్ధిపేట, హైదరాబాద్ జిల్లాల్లో ఈ విషాదకర ఘటనలు సంభవించాయి.
 
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచలాపూర్ గ్రామానికి చెందిన మైదం సాత్విక్ (18), సస్పూర్ పరిధిలోని దొరగారిపల్లెకు చెందినద గటిక తేజస్విని (18), ఖమ్మం జిల్లా ముదిగొండ గ్రామానికి చెందిన వైశాలి (17), మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌‍కు చెందిన హరిణి ఇటీవల ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షను రాసారు. ఈ ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. ఈ పరీక్షల్లో పైన పేర్కొన్న ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరో ఘటనలో మహబూబా బాద్ జిల్లా రెడ్యాలకు చెందిన అశ్విని (17) వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. 
 
కాగా, సిద్ధిపేట జిల్లా మర్కుర్ మండలం పాతూరుకు చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఈరన్న శ్రీజ (17) కూడా పరీక్షల్లో ఫెయిల్ అవుతానన్న భ యంతో ఆత్మహత్య చేసుకుంది. తీరా చూస్తే ఆ విద్యార్థిని 401 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. బుధవారం ఉదయం ఈ ఫలితాలు వెల్లడికాగా శ్రీజ అంతకుముందే అర్థరాత్రి ఈ విషాదకర నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. సంగక్కర పక్కనే కూర్చున్న మలైకా అరోరా?

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments