Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకుంది.. భర్తకు తెలిసిపోతుందనే భయంతో టెక్కీ ఆత్మహత్య

సెల్వి
గురువారం, 10 జులై 2025 (17:21 IST)
ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకున్న ఒక మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మంగళవారం రాత్రి కేపీహెచ్‌బీలో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ప్రైవేట్ కంపెనీలో పనిచేసే అనుష (25) ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసైంది. ఆమె భర్త కూడా సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్నాడు. 
 
మంగళవారం రాత్రి, తన భర్త ఇంట్లో లేని సమయంలో, అనూష ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. "అనూష ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకుంది. నష్టాలను పూడ్చుకోవడానికి ఆమె డబ్బు అప్పుగా తీసుకుని తన బంగారాన్ని తాకట్టు పెట్టింది. 
 
తన భర్తకు ఈ విషయం తెలుస్తుందని భయపడి ఆత్మహత్య చేసుకుంది" అని కెపిహెచ్‌బి ఇన్‌స్పెక్టర్ ఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. 
 
ఇంటికి వచ్చిన తర్వాత, అనూష భర్త ఆమె ఉరివేసుకుని ఉన్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి శవపరీక్ష నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments