56 మంది పురుషులు - 20 మంది మహిళలతో రేవ్ పార్టీ ... ఎక్కడ?

ఠాగూర్
బుధవారం, 15 అక్టోబరు 2025 (09:09 IST)
హైదరాబాద్ నగరంలో మరోమారు రేవ్ పార్టీ కలకలం రేపింది. 56 మంది పురుషులు 20 మంది మహిళలు కలసి ఈ రేవ్ పార్టీని చేసుకున్నారు. ఈ రేవ్ పార్టీపై పక్కా సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి భగ్నం చేశారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పాల్గొన్న వారంతా ఎరువుల తయారీ కంపెనీ యజమానులు కావడం గమనార్హం. ఈ యజమానుల కోసం 20 మంది అర్థనగ్న దుస్తుల్లో నృత్యం చేయించారు. 
 
పోలీసుల కథనం మేరకు.. రాక్‌స్టార్ ఫెర్టిలైజర్ యజమాని సైదారెడ్డి, వేద అగ్రి ఫెర్టిలైజర్‌కి చెందిన డీలర్ తిరుపతి రెడ్డి కలిసి ఫెర్టిలైజర్ యజమానుల కోసం ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఇది హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన మహేశ్వరం మండలం కె.చంద్రారెడ్డి రిసార్టులో ఏర్పాటు చేశారు. 
 
ఇందులో 56 మంది ఫెర్టిలైజర్ కంపెనీల యజమానులు, 20 మంది మహిళలు పాల్గొన్నారు. వీరందరూ అర్థనగ్నంగా నృత్యం చేస్తుండగా, మహేశ్వరం పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో మఫ్టీలో అక్కడకు వెళ్లిన పోలీసులు కాసేపు అక్కడే ఉండి తనిఖీలు చేశారు. ఈ రేవ్ పార్టీ కోసం ఉపయోగించిన విదేశీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్నవారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9 బంధాలు: సెంటిమెంట్ బాగా పండుతోంది.. ఆట పడిపోతుంది.. క్రేజ్ గోవిందా

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

Dhruv Vikram: పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట కథాంశంతో బైసన్ చిత్రం

Siddhu : క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని చెప్పా : సిద్ధు జొన్నలగడ్డ

అరి సినిమా రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది - డైరెక్టర్ జయశంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments