Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాడ్‌బరీ చాక్లెట్‌లో పురుగు.... అమీర్‌‍పేట మెట్రో స్టేషన్‌లోని షాపులో కొనుగోలు.. వీడియో వైరల్!!

ఠాగూర్
ఆదివారం, 11 ఫిబ్రవరి 2024 (12:05 IST)
తియ్యని వేడుక చేసుకుందాం.. అంటూ టీవీలో ప్రకటనలు ఇచ్చే డైరీ మిల్క్ కంపెనీ ఉత్పత్తి చేసే క్యాడ్‌బరీ చాక్లెట్‌లో పురుగు కనిపించింది. హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట మెట్రో రైల్వే స్టేషన్‌లోని ఓ షాపులో కొనుగోలు చేసిన చాక్లెట్‌లో ఈ పురుగు కనిపించింది. దీంతో కస్టమర్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే ఆ పురుగుతో పాటు చాక్లెట్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ అయింది. 
 
హైదరాబాద్ నగరానికి చెందిన రాబిన్ జాకెస్ అనే వ్యక్తి శుక్రవారం మెట్రోల్ ఇంటికి తిరిగి వెళుతూ పిల్లల కోసమని ఓ చాక్లెట్ కొనుగోలు చేశాడు. అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో ఓ రిటైల్ షాపులో క్యాడ్‌బరీ చాక్లెట్ తీసుకున్నాడు. తీరా ఇంటికి వెళ్లి కవర్ ఓపెన్ చేసి చూడగా, చాక్లెట్‌పై పురుగు కనిపించింది. అదీ కూడా కదులుతుండటంతో రాబిన్ ఆశ్చర్యపోయాడు. 
 
వెంటనే మొబైల్ ఫోనుతో వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. గడువు తీరిపోయిన చాక్లెట్లు అమ్ముతూ వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కాగా, ఈ ట్వీట్‌కు నెటిజన్లతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు, క్యాడ్‌బరీ డైరీ మిల్క్ కంపెనీ స్పందించింది. తగిన చర్యలు తీసుకుంటామంటూ ట్వీట్ చేశాయి. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

ఎన్.టి.ఆర్. జూనియర్ దేవర తాజా అప్ డేట్ ఇదే!

బిగ్‌బాస్‌ నెక్స్ట్ సీజన్‌లో వేణుస్వామి ఫిక్స్.. చరిత్రలోనే అత్యధిక పారితోషికం..??

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments