జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

ఠాగూర్
మంగళవారం, 21 అక్టోబరు 2025 (16:32 IST)
హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉపఎన్నికకు సంబంధించి నామినేషన్ల గడువు మంగళవారంతో ముగిసింది. ఈ గడువు ముగిసే సమయానికి మొత్తం 150కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. అలాగే, ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్రులు, రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) బాధిత రైతులు, ఓయూ, నిరుద్యోగ సంఘాల నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. 
 
మంగళవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత నుంచి గేటు లోపల ఉన్నవారికే నామినేషన్‌ వేసేందుకు అనుతించారు. దాఖలైన నామినేషన్లను రేపటి నుంచి రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరాం పరిశీలించనున్నారు. ఈ నెల 24వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు గడువు ఉంది. నవంబరు 11వ తేదీ ఈ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. కాగా, బీఆర్ఎస్‌కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మాంగటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

Bandla Ganesh: రవితేజకి ఆల్టర్నేట్ జొన్నలగడ్డ సిద్దు: బండ్ల గణేష్

డ్యూడ్ రూ.100 కోట్ల కలెక్షన్లు : హ్యాట్రిక్ కొట్టిన కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments