బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఐవీఆర్
సోమవారం, 17 నవంబరు 2025 (22:13 IST)
ఈమధ్య హిజ్రాలు తెలంగాణ రాష్ట్రంలో తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇటీవలే ఓ బిల్డింగు నిర్మించుకున్న యజమానితో గొడవపడి అతడిని దారుణంగా కొట్టడంతో అతడు కేసు పెట్టాడు. ఐతే ఇప్పుడు తమపైనే మరో హిజ్రా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుందంటూ 50 మందికి పైగా హిజ్రాలు హైదరాబాద్ బోరబండలో రోడ్డుపై నిరసనకు దిగారు. వారి నిరసనలను అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
 
ఇంతలో తమకు న్యాయం చేయాలంటూ ముగ్గురు హిజ్రాలు ఒంటిపై పెట్రోలు పోసుకున్నారు. వారిని పోలీసులు సముదాయిస్తుండగానే గుబుక్కున అగ్గిపుల్ల గీసుకుని అంటించుకున్నారు. దాంతో ముగ్గురికీ మంటలు అంటుకుని ఆర్తనాదాలు చేసారు. రోడ్డుపై ఆ ముగ్గురికి అంటుకున్న మంటలు తమకు ఎక్కడ అంటుకుంటాయోనని అక్కడ వున్న ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీసారు. ఎలాగో మంటలు అదుపుచేసి తీవ్ర గాయాలపాలైన హిజ్రాలను మోతీనగర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments