Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎం మెషీన్లలోని రూ.42లక్షలు స్వాహా.. హర్యానా ముఠా కోసం వేట

సెల్వి
సోమవారం, 23 సెప్టెంబరు 2024 (10:14 IST)
హర్యానాకు చెందిన దొంగల ముఠా ఏటీఎం మెషీన్లలోని భారీ మొత్తాన్ని కొట్టేసింది. కడప ఒంటిమిట్టలోని రెండు ఏటీఎంల నుంచి రూ.42 లక్షలు, కడప ప్రధాన కార్యాలయంలోని మరో ఏటీఎంపై కూడా ఆదివారం తెల్లవారుజామున దాడి చేసేందుకు ప్రయత్నించారు. 
 
దక్షిణాది రాష్ట్రాల్లోని ఎన్‌హెచ్ రోడ్ల వెంబడి ఉన్న ఏటీఎం కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడంలో పేరుగాంచిన ఈ ముఠా చెక్‌పోస్టులను తప్పించుకోవడానికి కట్టర్‌లను ఉపయోగించి లారీలలో తప్పించుకునే స్కెచ్ వేస్తోంది.
 
ఈ క్రమంలో ఆదివారం ఒక్కరోజే మూడు ఏటీఎం కేంద్రాలపై దాడులు చేశారు. ఒంటిమిట్ట ఏటీఎంలో తొలిసారిగా చోరీకి పాల్పడి కట్టర్లను ఉపయోగించి రూ. 36 లక్షలు తీసుకుని కడపలోని ద్వారకా నగర్ ఏటీఎంకు వెళ్లారు.. అక్కడ రూ.6 లక్షలు కొల్లగొట్టారు. 
 
ఆపై కడపలోని విశ్వేశ్వరయ్య సర్కిల్‌లోని ఏటీఎంలోనూ దోపిడీకి యత్నించారు. ఈ ఘటనలపై స్పందించిన కడప పోలీసులు జిల్లాలో వరుస చోరీలపై నిఘా పెంచారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. 
 
ఈ దొంగల ముఠాను గుర్తించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గత నెలలో ఇదే తరహాలో ఏటీఎం చోరీలకు పాల్పడిన ముఠాను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments