Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాసంగి సీజన్‌ రైతు బంధు విడుదలకు సీఎం రేవంత్ సమ్మతం

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (11:31 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పారు. ఎన్నికల ముందు యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు నిధుల విడుదలకు గత ప్రభుత్వం ప్రయత్నించినా అనివార్య కారణాల వల్ల నిధుల విడుదల సాధ్యంకాలేదు. ఇపుడు ఈ నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం ట్రెజరీలో ఉన్న నిధులను పంట పెట్టుబడి సాయం కింద రిలీజ్ చేసేలా ఆయన సూచించారు. 
 
రైతులకు రైతు భరోసా పథకం కింద ఎకరారు యేటా రూ.15 వేలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. గత ప్రభుత్వంలో బీడు భూములు, భూస్వాములకు కూడా రైతు బంధు పథకం కింద వందల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారని, వీటన్నింటిపై సమీక్షించిన తర్వాతే నీటిని విడుదల చేస్తామని పలువురు కాంగ్రెస్ మంత్రులు, నేతలు ప్రకటించారు. 
 
అయితే, ఇప్పటికిపుడు రైతు భరోసా అమలుకు రూ.11 వేల కోట్లు అవసరమవుతాయని వార్తలు వచ్చాయి. ఆ మొత్తం ఖజానాలో లేకపోవడంతో రైతు భరోసా నిధులు ఇప్పటిలే విడుదల కావంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో రైతులు ఆందోళన చెందారు. ఈ పరిస్థితుల్లో రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments