ప్రజా భవన్ వద్ద కారు ప్రమాదం : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్టు

వరుణ్
సోమవారం, 8 ఏప్రియల్ 2024 (11:33 IST)
గతంలో హైదరాబాద్ నగరంలోని ప్రజాభవన్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో భారత రాష్ట్ర సమితికి చెందిన మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కుమారుడు మహ్మద్ రహేల్‌ అమీర్‌ను భాగ్యనగరి పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ వచ్చిన రహేల్‌ను సోమవారం పోలీసులు విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు. ప్రజా భవన్ వద్ద జరిగిన కారు ప్రమాదం కేసులో రహేల్ నిందితుడిగా ఉన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో అతని కోసం గత కొంతకాలంగా పోలీసులు గాలిస్తూ వచ్చారు. అయితే, ప్రమాదం తర్వాత రహేల్ దుబాయ్‌కు పారిపోయాడు. 
 
ఈ ప్రమాదం తర్వాత రహేల్‌ బదులుగా మరొకరిని డ్రైవర్‌గా చేరి రహేల్‌ను దుబాయ్‌కు పారిపోయేలా కొందరు పోలీసులు ప్రయత్నించారు. దాంతో పోలీసులు రహేల్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతని కోసం లుకౌట్ నోటీసులు జారీచేశారు. ఈ క్రమంలో సోమవారం రహేల్ దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు తిరిగిరాగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను కూడా పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. సాక్ష్యాలను తారుమారు చేసిన ఆరోపణల కింద ఆయనపై పోలీసులు అభియోగాలు మోపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Yamini Bhaskar: ఆయన దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు : యామిని భాస్కర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments