గత 20 ఏళ్లలో తొలిసారిగా తెలంగాణలో భూప్రకంపనలు.. ములుగు జిల్లాలో?

సెల్వి
బుధవారం, 4 డిశెంబరు 2024 (11:38 IST)
strongest earthquake
గత 20 ఏళ్లలో తొలిసారిగా తెలంగాణలో అత్యంత బలమైన భూకంపం సంభవించింది. ములుగు వద్ద 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. హైదరాబాద్‌తో సహా తెలంగాణ మొత్తం ప్రకంపనలు సృష్టించింది. గోదావరి నదీగర్భంలో మరోసారి భూకంపం వచ్చినప్పటికీ బలమైన భూప్రకంనలు వచ్చాయి. 
 
చరిత్రలో హైదరాబాద్, ఆ చుట్టుపక్కల భూకంపాలను లెక్కలోకి తీసుకుంటే, ములుగు జిల్లాలో వచ్చినదే పెద్ద భూకంపం అంటున్నారు నిపుణులు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. 
 
ఇదే విధంగా.. 1993, సెప్టెంబర్‌ 30న తెల్లవారుజామున 3.55 గంటలకు హైదరాబాద్‌‌కి దగ్గర్లో భారీ భూకంపం ఏర్పడింది. అది హైదరాబాద్‌కి తూర్పు-ఈశాన్య దిశలో 226 కిలోమీటర్ల దూరంలో వచ్చింది. గత 124 సంవత్సరాలలో హైదరాబాద్ సమీపంలో సంభవించిన అత్యంత బలమైన భూకంపం అదే. హైదరాబాద్‌కి దగ్గర్లో గత పదేళ్లలో వచ్చిన భూకంపాల్లో ఒకటి 2020 ఏప్రిల్‌ 24న ఆసిఫాబాద్‌లో వచ్చింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.8గా నమోదైంది. 
 
ఇలా ఈ భూకంపాలన్నీ హైదరాబాద్ చుటుపక్కల వచ్చాయే తప్ప హైదరాబాద్‌లో రాలేదు. మరింతగా పర్యావరణ వినాశనం జరగకుండా చూసుకుంటే, ఇలాంటి తీవ్ర పరిస్థితులు రావు అని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర డియోల్ ఇకలేరు

వంద కోట్ల మార్కులో వరుసగా మూడు చిత్రాలు.. హీరో ప్రదీప్ రంగనాథన్ అదుర్స్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments