Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలానగర్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవదహనం

ఠాగూర్
ఆదివారం, 2 ఫిబ్రవరి 2025 (09:37 IST)
హైదరాబాద్ నగరంలోని బాలానగర్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. బాలానగర్‌లోని ఓ ఇంటిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో ఒకరు సజీవదహనమయ్యారు. మృతుడుని బాలానగర్ జలగం సాయి సత్య శ్రీనివాస్‌గా గుర్తించారు. ఇంటిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ మంటల్లో చిక్కుకోవడంతో ఆయన అక్కడే కాలిపోయాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతుంది. 
 
పటాన్‌చెరు రుద్రాంలోని ఓ రసాయన ఫ్యాక్టరీలో సత్య శ్రీనివాస్ పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపకదళ సిబ్బంది సాయంతో మంటలను ఆర్పివేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేదా ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

Shiva Kandukuri: చాయ్ వాలా మొదటి సింగిల్ సఖిరే లిరికల్ విడుదలైంది

Rajendra Prasad: ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం నేనెవరు : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments