Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు బీజేపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం - హైదరాబాద్‌కు హోం మంత్రి అమిత్ షా

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2023 (12:29 IST)
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ విస్తృత స్థాయి సమావేశం గురువారం హైదరాబాద్ నగరంలో జరుగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా భాగ్యనగరానికి వస్తున్నారారు. ఈ సమావేశంలో పాల్గొనే ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా, వచ్చే యేడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నందున ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై దిశానిర్దేశం చేయనున్నారు. ముందుగా ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. 
 
ఢిల్లీ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకునే ఆయన.. నేరుగా నొవోటెల్ హోటల్‌కు వెళ్లారు. ఆ తర్వాత భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకుంటారు. పిమ్మట కొంగరకలాన్‌కు వెళ్లి పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి రాష్ట్రశాఖ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. అలాగే, పార్టీ సీనియర్ నేతలు కె.లక్ష్మణ్, డీకే అరుణ, బండి సంజయ్, ప్రకాశ్ జవదేకర్, తరుణ్ ఛుగ్, సునీల్ బన్సర్, పార్టీ జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన 8 మంది ఎమ్మెల్యేలతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమవుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments