Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రజలారా... ఇకపై మీరు కరెంటు బిల్లులు కట్టవద్దు: కేటీఆర్ పిలుపు

ఐవీఆర్
శనివారం, 20 జనవరి 2024 (14:22 IST)
తాము అధికారంలోకి వస్తే గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తు ఇస్తామంటూ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారనీ, అందువల్ల ఈ నెల నుంచి తెలంగాణ ప్రజలు కరెంటు బిల్లులు కట్టవద్దని మాజీమంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారం సమయంలో కరెంటు బిల్లులను సోనియా గాంధీ కడతారని రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను ఆయన గుర్తు చేసారు. కనుక అధికారంలోకి వచ్చారు కనుక కరెంటు బిల్లులు ప్రభుత్వమే కట్టాలని డిమాండ్ చేసారు. ఇకపై ప్రజలు తమ కరెంటు బిల్లులను సోనియా గాంధీ ఇంటికి పంపించాలని అన్నారు.
 
మరోవైపు భారాసను 100 మీటర్ల లోతు గొయ్యి తీసి అందులో పాతిపెడతామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. 100 మీటర్ల లోతులో గొయ్యి తీసి పాతిపెట్టే విషయం తర్వాత చూద్దాం... మీరు ముందు ఇచ్చిన గ్యారెంటీలను నెరవేర్చాలని డిమాండ్ చేసారు.
 
తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన తెలంగాణ జెండాకు బొంద పెడతారా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తామన్న విషయాన్ని ముందుగా ఆచరించి చూపాలని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments