Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండాకాలం రాకముందే తెలంగాణాలో వేసవి ఎండలు..!!

ఠాగూర్
బుధవారం, 5 ఫిబ్రవరి 2025 (11:05 IST)
తెలంగాణ రాష్ట్రంలో వేసవికాలం ప్రారంభంకాకముందే భానుడి భగభగం మండిపోతున్నాయి. ఇపుడే కనిష్ఠంగా 18 డిగ్రీలు, గరిష్ఠంగా 37 డిగ్రీలు చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో వీటి స్థాయి మరింత తీవ్రంగా ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ప్రధానంగా తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వేడిగాలులు వీస్తున్నాయని, ఆ ప్రభావం వల్లే ఎండ తీవ్రత పెరుగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది.
 
పైగా, ఫిబ్రవరి నెలలోనే మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలు దాటుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండ తీవ్రత ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి దారుణంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
 
తెలంగాణలో వచ్చే మూడు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు రోజులు పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించింది. మూడు రోజులు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం సమయాల్లో పొగమంచు ఉంటుందని పేర్కొంది.
 
రాష్ట్రంలో మంగళవారం సరాసరి కనిష్ఠంగా 18 డిగ్రీలు, గరిష్ఠంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో 37, వరంగల్లు, నిజామాబాద్‌లో 37, మహబూబాబాద్ జిల్లాలో 36.1, మెదక్ జిల్లాలో 35.4, కరీంనగరులో 35.2, హైదరాబాద్ జిల్లాలో 34.2, నల్లగొండలో 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

సూర్య, పూజా హెగ్డే నటించిన రెట్రో సమీక్ష

ఇల్లూ వాకిలి తాకట్టుపెట్టి సినిమా తీశాం.. భారీ నష్టాలు చవిచూశాం : రకుల్ ప్రీత్ సింగ్ భర్త

ఓ విషయం మీద బలంగా రియాక్ట్ అవ్వాలని ఉంది... బన్నీ వాసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments