Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరువు లేనోడు పరువునష్టం దావా వేస్తాడా? హీరో నాగార్జునపై సీపీఐ నారాయణ ఫైర్

ఠాగూర్
ఆదివారం, 13 అక్టోబరు 2024 (10:53 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన హీరో అక్కినేని నాగార్జునపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేయడం హాస్యాస్పదంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. పరువు, గౌరవ మర్యాదలు లేని వ్యక్తి మంత్రి కొండ సురేఖపై పరువు నష్టం దావా వేయడం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు.  
 
'పరువు లేనోడు పరువునష్టం దావా వేస్తాదా? బిగ్ బాస్ షోతో పరువు పోగొట్టుకున్న నాగార్జున ఇప్పుడు కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు. హీరోయిన్ సమంత లాంటి వాళ్లు పరువునష్టం దావా వేస్తే అర్థం ఉంది కానీ... బిగ్‌బాస్ కార్యక్రమం ద్వారా అన్ పాపులర్ అయిన నాగార్జున పరువునష్టం దావా వేయడం అంటే అంతకంటే అవమానకరమైన విషయం మరొకటి ఉండదు. కొండా సురేఖ క్షమాపణలు కూడా చెప్పిన తర్వాత ఇక దానిపై ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు. నాగార్జున వంటి వ్యక్తి పరువునష్టం దావా వేయడం చూస్తుంటే ఓ జోక్‌లా అనిపిస్తోంది' అని నారాయణ ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments