Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కరోనా కలకలం.. ఇద్దరు మృతి

Webdunia
బుధవారం, 27 డిశెంబరు 2023 (16:04 IST)
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కరోనా కలకలం రేపింది. ఉస్మానియా దవాఖానలో చనిపోయిన ఇద్దరు రోగులకు వారి మరణానంతరం వచ్చిన రిపోర్ట్స్‌లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పలు అనారోగ్య కారణాలతో దవాఖానలో చేరిన హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు రెండు రోజుల వ్యవధిలో మరణించారు. మంగళవారం వచ్చిన నివేదికల్లో ఆ ఇద్దరికీ కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే ఉస్మానియా వైద్యులు తొలుత ఒక మరణాన్ని మాత్రమే నిర్ధారించారు. 
 
మంగళవారం రాత్రి రెండో మరణాన్ని కూడా ధ్రువీకరించారు. వీరితోపాటు ఇటీవల ఉస్మానియాలో చేరిన వికారాబాద్‌ జిల్లా ధరూర్‌కు చెందిన ఎన్‌ పార్వతమ్మ (61), రాజేంద్రనగర్‌కు చెందిన ఏళ్ల పల్లె లక్ష్మణ్‌ (36), మల్లేపల్లికి చెందిన ఎండీ హఫ్సా బేగం (12)కు కరోనా పాజిటివ్‌గా తేలింది. 
 
వీరు ప్రస్తుతం దవాఖానలోనే చికిత్స పొందుతున్నారు. యితే, జేఎన్‌1 వేరియంట్‌ వైరస్‌ తేలికపాటిదేనని, ప్రజలు భయపడాల్సిన అవసరంలేదని వైద్యులు చెప్తున్నారు. రాష్ట్రంలో మంగళవారం కొత్తగా ఎనిమిది కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. నలుగురు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 59 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

What God is doing: దేవుడు ఏమి చేస్తున్నాడో దేవుడికి మాత్రమే తెలుసు.. వర్మ సెటైర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments