Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కరోనా కలకలం.. ఇద్దరు మృతి

Webdunia
బుధవారం, 27 డిశెంబరు 2023 (16:04 IST)
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కరోనా కలకలం రేపింది. ఉస్మానియా దవాఖానలో చనిపోయిన ఇద్దరు రోగులకు వారి మరణానంతరం వచ్చిన రిపోర్ట్స్‌లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పలు అనారోగ్య కారణాలతో దవాఖానలో చేరిన హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు రెండు రోజుల వ్యవధిలో మరణించారు. మంగళవారం వచ్చిన నివేదికల్లో ఆ ఇద్దరికీ కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే ఉస్మానియా వైద్యులు తొలుత ఒక మరణాన్ని మాత్రమే నిర్ధారించారు. 
 
మంగళవారం రాత్రి రెండో మరణాన్ని కూడా ధ్రువీకరించారు. వీరితోపాటు ఇటీవల ఉస్మానియాలో చేరిన వికారాబాద్‌ జిల్లా ధరూర్‌కు చెందిన ఎన్‌ పార్వతమ్మ (61), రాజేంద్రనగర్‌కు చెందిన ఏళ్ల పల్లె లక్ష్మణ్‌ (36), మల్లేపల్లికి చెందిన ఎండీ హఫ్సా బేగం (12)కు కరోనా పాజిటివ్‌గా తేలింది. 
 
వీరు ప్రస్తుతం దవాఖానలోనే చికిత్స పొందుతున్నారు. యితే, జేఎన్‌1 వేరియంట్‌ వైరస్‌ తేలికపాటిదేనని, ప్రజలు భయపడాల్సిన అవసరంలేదని వైద్యులు చెప్తున్నారు. రాష్ట్రంలో మంగళవారం కొత్తగా ఎనిమిది కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. నలుగురు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 59 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments