Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగరేణి కార్మికులకు రూ. 1.90లక్షల బోనస్‌.. దసరా కానుక

సెల్వి
శనివారం, 21 సెప్టెంబరు 2024 (10:44 IST)
సింగరేణి కార్మికులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. 
 
అలాగే సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌ ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దసరాకు ముందుగానే బోనస్‌ ఇస్తున్నామని చెప్పారు. సింగరేణిలో 33 శాతం లాభాలు పంచుతామన్న ముఖ్యమంత్రి.. ఒక్కొక్కరికి రూ. లక్షా 90 వేలు బోనస్‌ ఇస్తున్నట్టు వెల్లడించారు. 
 
రూ.796 కోట్లు బోనస్‌గా అందిస్తామని వివరించారు. గతేడాది కంటే రూ.20 వేలు అధికంగా ఇస్తామని చెప్పారు. అలాగే సౌర విద్యుత్ ప్లాంట్‌ను 1,000 మెగావాట్లకు విస్తరించడం, రామగుండంలో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు. సింగరేణి ఉత్పత్తిని పెంచుతూ ఇతర రాష్ట్రాలకు కూడా బొగ్గు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రాజెక్టుపై చర్చల కోసం పిలిచి దుస్తులు విప్పేయమన్నారు : హీరోయిన్ ఆరోపణలు

సినిమాలో సిగరెట్లు కాల్చాను.. నిజ జీవితంలో ఎవరూ పొగతాగకండి : హీరో సూర్య వినతి

అమెరికా నుంచి కన్నప్ప భారీ ప్రమోషన్స్ కు సిద్ధమయిన విష్ణు మంచు

థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్‌ తెలుగులో జింగుచా.. వివాహ గీతం రేపు రాబోతుంది

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments