Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డి భాష సీఎం హోదాకు సరిపోతుందా?: కేసీఆర్ ప్రశ్న

సెల్వి
మంగళవారం, 12 మార్చి 2024 (22:00 IST)
తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరుపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. కరెంటు, నీటి కష్టాలతో సతమతమవుతున్న రైతుల కష్టాలను నిర్లక్ష్యం చేస్తోందని, పంటలను తగలబెట్టడం బాధాకరమైన చర్య అంటూ తెలిపారు. 
 
రైతులను పట్టించుకోకుండా.. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా.. కాంగ్రెస్ సీఎంతో పాటు ఆయన మంత్రులు బీఆర్ఎస్ పాలనను నిందించడాన్ని పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. 
 
కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన 'కదన భేరి' బహిరంగ సభలో  చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ హామీలను నెరవేర్చకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 
 
 
 
"తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, మా సమస్యలను ఎత్తిచూపడానికి నేను ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ పాలకులపై కొన్ని బలమైన పదజాలాన్ని ఉపయోగించాను. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత నా రాజకీయ ప్రత్యర్థులను ఎప్పుడూ దుర్భాషలాడలేదు. 
 
కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి తన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టకుండా, గత పాలనపై నిందలు వేయడంలో, మాటల దాడులతో బిజీగా ఉన్నారు" అని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి భాష ముఖ్యమంత్రి హోదాకు సరిపోతుందా అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments