పాఠాశాల ఐదో అంతస్థు నుంచి దూకేసిన పదవ తరగతి బాలిక.. కారణం ఏంటి?

సెల్వి
మంగళవారం, 25 నవంబరు 2025 (13:01 IST)
హైదరాబాద్‌లోని ఒక పాఠశాల భవనం ఐదవ అంతస్తు నుంచి దూకి 10వ తరగతి చదువుతున్న బాలిక మరణించింది. నగరంలోని హబ్సిగూడ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. 15 ఏళ్ల బాలిక చదువు బాగాలేదని తల్లిదండ్రులు హెచ్చరించడంతో ఆమె మనస్తాపం చెందిందని సమాచారం.
 
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తెలంగాణలో పాఠశాల విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఇది రెండోసారి.
 
నిజామాబాద్ జిల్లాలోని చంద్రూర్‌లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో సోమవారం 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. బెడ్‌షీట్‌తో తన గదిలో ఇనుప రాడ్‌కు వేలాడుతూ కనిపించాడు. అతని తోటి విద్యార్థులు అతను ఉరివేసుకుని ఉండటాన్ని గమనించి సిబ్బందికి సమాచారం అందించారు. వారు పోలీసులకు అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)కి తరలించారు.

ఈ నేపథ్యంలో మరో పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఒక రోజు క్రితం ఆధార్ కార్డు వివరాలను అప్‌డేట్ చేయడానికి నిజామాబాద్ వచ్చినప్పుడు అతను సాధారణంగానే ఉన్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ నిర్లక్ష్యం కారణంగా రెసిడెన్షియల్ స్కూల్‌లోని ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేసింది.
 
బాలుడి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం, అన్ని రకాల సహాయాన్ని అందించాలని కూడా ఏఐఎంఐఎం నేత అసదుద్ధీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. కుటుంబంలోని ఒక సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఒవైసీ ప్రభుత్వాన్ని కోరారు.
 
ఖురేషి విద్యార్థి కుటుంబంతో కూడా మాట్లాడి సాధ్యమైన అన్ని సహాయాలు చేస్తామని హామీ ఇచ్చారు. విచారణ జరపాలని జిల్లాలోని టీఎంఆర్ఈఐఎస్ అధికారులను ఆదేశించారు. ప్రాథమిక విచారణ తర్వాత, పాఠశాలలోని ముగ్గురు ఉద్యోగులను నిర్లక్ష్యం కారణంగా సస్పెండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments