Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ యువతి ప్రాణాలు తీసిన ఇద్దరు వ్యక్తుల గొడవ...

ఠాగూర్
శుక్రవారం, 5 జనవరి 2024 (11:43 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ ఓ యువతి ప్రాణాలు తీసింది. దీంతో పెళ్లింటి విషాదం నెలకొంది. ఈ ఘటన మెదక్ జిల్లాలోని చేగుంట మండలం, రెడ్డిపల్లి కాలనీలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, రెడ్డిపల్లి వడ్డెర కాలనీకి చెందిన ఉప్పు వెంకటి అనే వ్యక్తి కుమార్తె సువర్ణ వివాహం గురువారం జరిగింది. పెళ్లి కుమార్తెను ఊరేగింపుగా తీసుకెళ్లి కామారెడ్డి జిల్లా బికనూు మండలం లక్ష్మీదేవిపల్లిలోని మెట్టినింటికి పంపించారు. అయితే, తిరిగి ఇంటికి వస్తుండగా అదే కాలనీకి చెందిన ఉప్పు నరేందర్, స్వామి మధ్య గొడవ జరిగింది. 
 
ఈ ఘర్షణలో స్వామిని నరేందర్ నెట్టేశాడు. దీంతో కిందపడిన స్వామిని అక్కడున్న వారు పక్కకు తీసుకెళ్లారు. దీంతో ఆగ్రహానికి గురైన నరేందర్ తన థార్ కారును తీసుకొచ్చి అక్కడ ఉన్న పెళ్లి బందంపై ఎక్కించారు. ఈ ఘటనలో రమ్య (23) అనే యువతి తీవ్రంగా గాయపడటంతో, ఆమెను హైదరాబాద్ తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. ఇక ఉప్పు దుర్గయ్య, సుజాత, యాదగిరి, సురేష్‌లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నరేందర్ కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments