ఓ యువతి ప్రాణాలు తీసిన ఇద్దరు వ్యక్తుల గొడవ...

ఠాగూర్
శుక్రవారం, 5 జనవరి 2024 (11:43 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ ఓ యువతి ప్రాణాలు తీసింది. దీంతో పెళ్లింటి విషాదం నెలకొంది. ఈ ఘటన మెదక్ జిల్లాలోని చేగుంట మండలం, రెడ్డిపల్లి కాలనీలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, రెడ్డిపల్లి వడ్డెర కాలనీకి చెందిన ఉప్పు వెంకటి అనే వ్యక్తి కుమార్తె సువర్ణ వివాహం గురువారం జరిగింది. పెళ్లి కుమార్తెను ఊరేగింపుగా తీసుకెళ్లి కామారెడ్డి జిల్లా బికనూు మండలం లక్ష్మీదేవిపల్లిలోని మెట్టినింటికి పంపించారు. అయితే, తిరిగి ఇంటికి వస్తుండగా అదే కాలనీకి చెందిన ఉప్పు నరేందర్, స్వామి మధ్య గొడవ జరిగింది. 
 
ఈ ఘర్షణలో స్వామిని నరేందర్ నెట్టేశాడు. దీంతో కిందపడిన స్వామిని అక్కడున్న వారు పక్కకు తీసుకెళ్లారు. దీంతో ఆగ్రహానికి గురైన నరేందర్ తన థార్ కారును తీసుకొచ్చి అక్కడ ఉన్న పెళ్లి బందంపై ఎక్కించారు. ఈ ఘటనలో రమ్య (23) అనే యువతి తీవ్రంగా గాయపడటంతో, ఆమెను హైదరాబాద్ తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. ఇక ఉప్పు దుర్గయ్య, సుజాత, యాదగిరి, సురేష్‌లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నరేందర్ కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments