Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగ్‌రూట్‌లో వచ్చి కారు ఢీకొని సీఐ దుర్మరణం.. ఎక్కడ?

ఠాగూర్
బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (12:24 IST)
హైదరాబాద్ నగరంలోని ఎల్పీ నగర్‌లో ఓ విషాదకర ఘటన జరిగింది. రాంగ్ రూట్‌లో వచ్చిన ఓ కారు ఢీకొట్టడంతో ద్విచక్రవాహనంపై వెళుతున్న చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ సాధిక్ అలీ దుర్మరణం పాలయ్యారు. అలాగే, ఎస్.ఐ. కాజావలీకి గాయాలయ్యాయి. మంగళవారం అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాద వార్తలను పరిశీలిస్తే, 
 
ఎల్బీ నగర్‌లో ఓ కారు యూటర్న్ తీసుకుని రాంగ్ రూట్‌లో వెళుతూ ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై ప్రయాణిస్తున్న సీఐ సాధిక్ అలీ మృతి చెందారు. ఎస్.ఐ కాజావలీ మొహినుద్దీన్ గాయాలపాలయ్యారు. సాధిక్ అలీ చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో చేస్తుండగా, కాజావలీ నారాయణగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో చేస్తున్నారు. 
 
మలక్‌పేట క్వార్టర్స్‌లో ఉండే వీరిద్దరూ మంగళవారం సాయంత్రం ఓ ఫంక్షన్‌కు వెళ్ళి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన కారు వినుషా శెట్టి అనే పేరుపై రిజిస్టర్ అయి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కారుపై ఓవర్ స్పీడ్, డెంజర్ డ్రైవింగ్, చలాన్లు కూడా ఉండటం గమనార్హం. ప్రమాదం జరిగిన తర్వాత కూడా డ్రైవర్ కారును ఆపకుండా వెళ్లిపోయినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments