Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగ్‌రూట్‌లో వచ్చి కారు ఢీకొని సీఐ దుర్మరణం.. ఎక్కడ?

ఠాగూర్
బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (12:24 IST)
హైదరాబాద్ నగరంలోని ఎల్పీ నగర్‌లో ఓ విషాదకర ఘటన జరిగింది. రాంగ్ రూట్‌లో వచ్చిన ఓ కారు ఢీకొట్టడంతో ద్విచక్రవాహనంపై వెళుతున్న చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ సాధిక్ అలీ దుర్మరణం పాలయ్యారు. అలాగే, ఎస్.ఐ. కాజావలీకి గాయాలయ్యాయి. మంగళవారం అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాద వార్తలను పరిశీలిస్తే, 
 
ఎల్బీ నగర్‌లో ఓ కారు యూటర్న్ తీసుకుని రాంగ్ రూట్‌లో వెళుతూ ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై ప్రయాణిస్తున్న సీఐ సాధిక్ అలీ మృతి చెందారు. ఎస్.ఐ కాజావలీ మొహినుద్దీన్ గాయాలపాలయ్యారు. సాధిక్ అలీ చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో చేస్తుండగా, కాజావలీ నారాయణగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో చేస్తున్నారు. 
 
మలక్‌పేట క్వార్టర్స్‌లో ఉండే వీరిద్దరూ మంగళవారం సాయంత్రం ఓ ఫంక్షన్‌కు వెళ్ళి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన కారు వినుషా శెట్టి అనే పేరుపై రిజిస్టర్ అయి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కారుపై ఓవర్ స్పీడ్, డెంజర్ డ్రైవింగ్, చలాన్లు కూడా ఉండటం గమనార్హం. ప్రమాదం జరిగిన తర్వాత కూడా డ్రైవర్ కారును ఆపకుండా వెళ్లిపోయినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments