Webdunia - Bharat's app for daily news and videos

Install App

బండి సంజయ్‌కు కీలక పదవి.. బీజేపీ కిసాన్ మోర్చా ఇన్‌చార్జ్‌గా నియామకం

Webdunia
గురువారం, 4 జనవరి 2024 (09:38 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన కీలక నేత, ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించింది. రెండు మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బండి సంజయ్‌ను బీజేపీ కిసాన్ మోర్చా ఇన్‌చార్జ్‌గా నియమించడం గమనార్హం. అలాగే, మరికొందరు సీనియర్ నేతలకు కూడా కీలక బాధ్యతలను అప్పగించింది. 
 
యువమోర్చా ఇన్‌చార్జిగా సునీల్ బన్సల్, కిసాన్ మోర్జా ఇన్‌చార్జిగా బండి సంజయ్ కుమార్‌లను పార్టీ అధిష్టానం నియమించింది. ఇక ఎస్సీ మోర్చా ఇన్‌చార్జిగా డాక్టర్ రాధా మోహన్ దాస్ అగర్వాల్, బీజేపీ మోర్చా ఇన్‌చార్జిగా వినోద్ తావ్డే, మైనారిటీ మోర్చా ఇన్‌చార్జిగా దష్యంత్ కుమార్ గౌతమ్‌లను నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది. 
 
కాగా, జూలై 2023లో చివరిసారి బీజేపీ జాతీయ అఫీస్ బేరర్ల పునర్‌వ్యవస్థీకరణ జరిగింది. గత యేడాది డిసెంబరు నెలలో బీజేపీ పంజాబ్ రాష్ట్ర పార్టీ విభాగాల ఇన్‌చార్జులను మార్చింది. వివిధ విభాగాలకు 70 మందితో ఇన్‌చార్జులను, సహా ఇన్‌చార్జులను నియమించిన విషయం తెల్సిందే. ఈ యేడాది సార్వత్రిక ఎన్నికలు జరగాల్సివుండటంతో పార్టీలో అంతర్గత మార్పులు చేర్పులు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments