Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలాపూర్ లడ్డుకు రికార్డు ధర... సొంతం చేసుకున్న శంకర్ రెడ్డి

ఠాగూర్
మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (16:54 IST)
హైదరాబాద్ బాలాపూర్ లడ్డూ మరోమారు రికార్డు స్థాయి ధర పలికింది. మంగళవారం ఉదయం లడ్డూ వేలం పాటలు నిర్వహించింది. గత యేడాది ఈ లడ్డూ ధర రూ.27 లక్షల ధర పలుకగా, ఈ యేడాది ఈ ధర రూ.30 లక్షల మేరకు పలికింది. ఈ లడ్డూను కొలను శంకర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. క్రితం యేడాది దాసరి దయానంద రెడ్డి రూ.27 లక్షలకు దక్కించుకున్నారు కాగా, లడ్డూ వేలం పాట ముగియడంతో మరికాసేపట్లో గణేశుడు శోభాయాత్ర చేపట్టనున్నట్టు బాలాపూర్ నిర్వాహకులు వెల్లడించారు. 
 
కాగా, బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట తొలిసారి 1994 నుంచి జరుగుతుంది. వారం పాటు స్వామివారితో పాటు పూజలందుకున్న లడ్డూను చివరి రోజు వేలం వేయడం ప్రారంభమవుతుంది. బాలాపూర్ ముఖ్య కూడలిలోని బొడ్రాయి వద్ద వేలం పాట నిర్వహించడం ఆనవాయితి. తొలి యేడాది వేలం పాటలో బాలాపూర్ లడ్డూ ధర రూ.450లకు ఓ భక్కుడు కొనుగోలు చేశాడు. 2020లో కరోనా కారణంగా ఈ వేలం పాటను రద్దు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

''ఫౌజీ''లో ఇద్దరమ్మాయిలతో ప్రభాస్ రొమాన్స్?

టాలీవుడ్ లో లైంగిక వేధింపుల పరిష్కారానికి మహిళా కమిటీ ఏర్పాటు

సి-అంటే సిగ్గు ని- అంటే నిజాయితీ.. మా- అంటే మానం వుండదు.. బషీర్ మాస్టర్ (video)

బిగ్ బాస్ హౌస్‌లో మూడో వారం.. ఎలిమినేట్ అయిన వారు ఎవరు?

మోక్షజ్ఞ సినిమాకు భారీ బడ్జెట్.. రూ.100 కోట్లు ఖర్చు చేస్తారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments