Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్టు.. ఆర్టీసీ డ్రైవరుపై ఆటోవాలాల దాడి...

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2023 (10:19 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఇది ఆ రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల జీవితాలకు శరఘాతంగా మారింది. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటోల్లో ఎక్కే మహిళలే లేకుండా పోయింది. దీంతో తమ జీవనాధారం పోయిందంటూ ఆటో డ్రైవర్లు రోడ్డెక్కి ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితి చేయిదాటిపోకుండా ఉండేందుకు వీలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లతో ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించారు. అయినప్పటికీ ఆటో డ్రైవర్లు శాంతించడం లేదు. 
 
తాజాగా ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై కొందరు ఆటో డ్రైవర్లు దాడి చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం వెలుగు చూసింది. ఖమ్మం వైపు వెళుతున్న బస్సు ఒకటి మధ్యాహ్నం కొత్తగూడెం పట్టణంలోని పోస్టాఫీస్ వద్దకు వచ్చి ఆగింది. దీంతో అప్పటివరకు సర్వీసు ఆటోల్లో కూర్చొన్న మహిళలంతా ఆటో దిగిపోయి బస్సులో కూర్చొన్నారు. 
 
ఇదంతా చూసిన ఆవేశానికి గురైన నలుగురు ఆటో డ్రైవర్లు బస్సు డ్రైవర్ నాగరాజుపై దాడికి పాల్పడ్డారు. అతడిపై నీళ్లు చల్లుతూ పరుష పదజాలంతో దుర్భాషలాడారు. కండక్టర్‌తో పాటు ఇతర వాహనదారులను వారిని వారించే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. ఈ ఘటనపై కొత్తగూడెం డిపో మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments