Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఎఎస్ఐ

ఐవీఆర్
బుధవారం, 27 మార్చి 2024 (11:52 IST)
మహిళా ఫిర్యాదురాలితో అక్రమ సంబంధం పెట్టుకున్న జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎఎస్ఐను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐ. జీ ఎ. వి. రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేసారు. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మహిళా తన భర్త గత రెండు సంవత్సరాలుగా వేధింపులకు గురి చేస్తున్నట్లుగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇదే పోలీస్ స్టేషన్లో ఎఎస్ఐ వి. రామయ్య కూడా విధులు నిర్వహిస్తుండంతో సదరు బాధిత మహిళతో పరిచయం ఏర్పడింది.
 
బాధితురాలికి తగు న్యాయం చేస్తానని ఆమెను నమ్మించి, సదరు మహిళ ఫోన్ నంబర్ తీసుకుని ఆమెతో సన్నిహింతగా వుంటూ అక్రమ సంబంధం కొనసాగించాడు. తాను బందోబస్తూ విధులు నిర్వహించే ప్రదేశానికి సదరు మహిళను పిలిపించుకొని ఆమెతో ఏకాంతంగా గడిపేవాడు.
 
ఎఎస్ఐ రాసలీలలు స్థానిక సామజిక మధ్యామాల్లో ప్రచారం జరగడంతో విచారణ జరుపగా ఎఎస్ఐ పిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లు తేలింది. ఈ కారణంగా ఎఎస్ఐని సస్పెండ్ చేస్తున్నట్లుగా మల్టీ జోన్ 1 ఐజీ ఎ. వి. రంగనాథ్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments