Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఎఎస్ఐ

ఐవీఆర్
బుధవారం, 27 మార్చి 2024 (11:52 IST)
మహిళా ఫిర్యాదురాలితో అక్రమ సంబంధం పెట్టుకున్న జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎఎస్ఐను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐ. జీ ఎ. వి. రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేసారు. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మహిళా తన భర్త గత రెండు సంవత్సరాలుగా వేధింపులకు గురి చేస్తున్నట్లుగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇదే పోలీస్ స్టేషన్లో ఎఎస్ఐ వి. రామయ్య కూడా విధులు నిర్వహిస్తుండంతో సదరు బాధిత మహిళతో పరిచయం ఏర్పడింది.
 
బాధితురాలికి తగు న్యాయం చేస్తానని ఆమెను నమ్మించి, సదరు మహిళ ఫోన్ నంబర్ తీసుకుని ఆమెతో సన్నిహింతగా వుంటూ అక్రమ సంబంధం కొనసాగించాడు. తాను బందోబస్తూ విధులు నిర్వహించే ప్రదేశానికి సదరు మహిళను పిలిపించుకొని ఆమెతో ఏకాంతంగా గడిపేవాడు.
 
ఎఎస్ఐ రాసలీలలు స్థానిక సామజిక మధ్యామాల్లో ప్రచారం జరగడంతో విచారణ జరుపగా ఎఎస్ఐ పిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లు తేలింది. ఈ కారణంగా ఎఎస్ఐని సస్పెండ్ చేస్తున్నట్లుగా మల్టీ జోన్ 1 ఐజీ ఎ. వి. రంగనాథ్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments