Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

ఠాగూర్
ఆదివారం, 12 మే 2024 (15:49 IST)
తెలంగాణా రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగియడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త రిలాక్స్ అయ్యారు. అయితే, పోటీలో ఉన్న అభ్యర్థులు మాత్రం పోలింగ్‌ ముందు రోజు చేసుకోవాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమైవున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలోని సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడారు. ఆదివారం ఉదయం యూనివర్శిటీకి చేరుకుని విద్యార్థులతో కలిసి చలాకీగా ఫుట్‌బాల్ ఆడుతూ కనిపించారు. ఆయనతో కలిసి పలువురు కాంగ్రెస్ నేతలు కూడా మైదానంలో దిగారు.
 
ఫుట్‌బాల్ ఆడుతుండగా ఒక దశలో షూ పాడైపోయింది. అయినప్పటికీ ఆయన దాన్ని తీసేసి ఒట్టి కాళ్లతోనే మైదానంలో నలువైపులా పరుగెత్తుతూ ఫుట్‌బాల్ ఆడారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీఎంఆర్ ఐఈఎస్ ప్రెసిడెంట్ ఫహీం ఖురేషీ, హెచ్‌సీయూ ఎన్.ఎస్.యూ.ఐ విభాగం, హెచ్.సి.యు. విద్యార్థులు కూడా ఈ క్రీడలో పాలుపంచుకున్నారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం, టీశాట్ ఈఈవో వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments